Rajyasabhaలో విజయసాయిరెడ్డి ప్రశ్నల వర్షం.... కేంద్రమంత్రి మీనాక్షి కీలక వ్యాఖ్యలు

by srinivas |
Rajyasabhaలో విజయసాయిరెడ్డి ప్రశ్నల వర్షం.... కేంద్రమంత్రి మీనాక్షి కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారతీయ సంస్కృతి, వారసత్వాన్ని ప్రచారం చేసేందుకు జీ20 వేదికను వినియోగిస్తామని సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి స్పష్టం చేశారు. భారతీయ సంస్కృతి, ప్రాచీన సంస్కృతి పరిరక్షణకు, చోరీకి గురై దేశం నుంచి తరలిపోయిన ప్రాచీన కళాఖండాలను తిరిగి వెనక్కి రప్పించడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోందని రాజ్యసభలో గురువారం ప్రశ్నోత్తరాల సమయంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగారు. అలాగే జీ20 వేదికగా భారత సంస్కృతి, సాంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? అని కేంద్రమంత్రిని ప్రశ్నించారు. విజయసాయి రెడ్డి ప్రశ్నకు కేంద్రమంత్రి మీనాక్షి లేఖి సమాధానమిచ్చారు.

జీ20 వేదికపై భారతీయ సంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబచేసే దిశగా ప్రభుత్వం జీ20 భాగస్వామ్య దేశాలన్నింటితోను సంప్రదింపులు జరుపున్నట్లు సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి వెల్లడించారు. చోరీకి గురైన ప్రాచీన కళాఖండాలను తిరిగి దేశాలను రప్పించే విషయంలో యునెస్కో ఒడంబడికకు లోబడి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఒడంబడికపై సంతకాలు చేసిన రెండు దేశాల మధ్య ఆయా దేశాల వారసత్వ సంపదను పరస్పరం కాపాడాలన్నారు. దీనికి సంబంధించి ఇటీవలే స్కాట్‌లాండ్‌ విదేశాంగ మంత్రితో చర్చలు జరిపినట్లు స్పష్టం చేశారు. అలాగే వివిధ దేశాల ప్రతినిధులతో సంప్రదింపులు కొనసాగుతున్నాయని, ఇదో నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. చోరీకి గురై విదేశాలకు తరలిపోయిన కళాఖండాలను తిరిగి వెనక్కి రప్పించే ప్రక్రియలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నట్లు మంత్రి చెప్పారు. చోరీకి గురైన కళాఖండాలకు సంబంధించి సరైన వివరాలు లేకపోవడం, చోరీ జరిగినట్లు రిపోర్టు కాకపోవడం వంటి తగిన డాక్యుమెంట్‌ ఆధారాలు లభ్యంకానందున ఈ ప్రక్రియలో జాప్యం చోటు చేసుకుంటున్నట్లు సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి వివరించారు.

READ MORE

తీవ్ర విషాదంలో సీతారత్నం, మహేశ్.. పరామర్శించిన Chandrababu

Next Story

Most Viewed